Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పింఛన్‌దారుడి మరణానంతరం భార్య/భర్తకు వెంటనే పింఛన్ మంజూరు!

పింఛన్‌దారుడి మరణానంతరం భార్య/భర్తకు వెంటనే పింఛన్ మంజూరు!

వార్త 2 weeks ago

Telangana Cheyutha Pension: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌దారుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు మరొక బృహత్తర నిర్ణయం తీసుకుంది. పింఛన్‌ పొందుతున్న వ్యక్తి మరణించిన సందర్భంలో, వారి జీవిత భాగస్వామికి (భార్య లేదా భర్త) ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే పింఛన్‌ను మంజూరు చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం 'చేయూత' కింద ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు ఉన్న కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.

Read Also :Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకంలో కీలక విస్తరణ.. మరో 5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్

Telangana Cheyutha Pension: నూతన విధానంలోని ముఖ్యాంశాలు

  1. జీవిత భాగస్వామికి తక్షణ పింఛన్:పింఛన్‌దారుడు మరణించిన వెంటనే కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, వారి భార్య లేదా భర్త పేరిట పింఛన్‌ను తక్షణమే బదిలీ/మంజూరు చేస్తారు.
  2. వితంతువులు & ఒంటరి మహిళలకు ప్రాధాన్యం:కుటుంబ యజమానిని కోల్పోయి నిరాధారంగా మారే వితంతువులు, ఒంటరి మహిళల దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి వేగంగా పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటారు.
  3. ప్రత్యేక లాగిన్ల అందుబాటు:ఈ ప్రక్రియలో సాంకేతిక విలంబనను నివారించేందుకు, క్షేత్రస్థాయిలోనే వేగంగా ఆమోదం తెలిపేలా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (DRDOs) మరియు మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక లాగిన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ నిర్ణయంతో పింఛనుదారుడి మరణానంతరం సదరు కుటుంబానికి తక్షణ ఆర్థిక ఆసరా లభించడమే కాకుండా, నెలల తరబడి పింఛన్ ఆమోదం కోసం ఎదురుచూడాల్సిన అవసరం తప్పనుంది.

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha