Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొగాకు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పొగాకు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

వార్త 2 weeks ago

AP Tobacco Farmers: ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు (Tobacco) రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, వారి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది.

మార్కెట్‌లో రైతులకు సరైన మద్దతు ధర లభించేలా మరియు వ్యాపారుల దోపిడీకి చెక్ పెట్టేలా పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది.

Read Also:Nellore tribals: నెల్లూరు గిరిజనులకు ముఖ్యమంత్రి తీపి కబురు

AP Tobacco Farmers: ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు

  1. రూ. 50 వేల వడ్డీలేని రుణం:పొగాకు సాగు చేసే ప్రతి రైతుకు రూ. 50,000 చొప్పున రెండేళ్ల పాటు వడ్డీలేని రుణం (Interest-Free Loan) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రైతులకు పెట్టుబడి సాయంగా ఎంతో ఉపయోగపడనుంది.
  2. క్వింటాల్‌కు రూ. 1,000 ప్రోత్సాహకం:రైతుల వద్ద పొగాకు కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే క్వింటాల్‌కు రూ. 1,000 చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో (DBT) జమ చేయనున్నారు.
  3. సాగు పరిమితి ఖరారు:మార్కెట్‌లో నాణ్యత, ధర స్థిరంగా ఉండేందుకు వచ్చే ఏడాది పొగాకు సాగును 80 మిలియన్ కిలోలకు (80 Million Kgs) పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  4. నాణ్యతా నిర్ధారణ కమిటీ (Quality Assessment Committee):పొగాకు కొనుగోలు సమయంలో నాణ్యత సాకుతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించకుండా అడ్డుకట్ట వేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ పొగాకు కేటగిరీలను, నాణ్యతను నిష్పాక్షికంగా నిర్ధారిస్తుంది.

ఈ చర్యల ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది పొగాకు రైతులకు ఆర్థిక భద్రత చేకూరడంతో పాటు మార్కెట్‌లో వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడనుంది.

Epaper: epaper.vaartha.com

దివ్యాంగులకు ఉచితంగా యూడీఐడీ కార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha