Dailyhunt
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఖబడ్దార్

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఖబడ్దార్

వార్త 1 week ago

Kadiri News: సర్వేనెంబర్ 83 లో ఆక్రమణలపై గతంలో ఫిర్యాదు అందడంతో సర్వే చూస్తున్నామని ఒక వారం రోజుల్లో సర్వే పూర్తి అవ్వగానే అక్రమ దారులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాంని కదిరి తహసిల్దార్ రెడ్డి శేఖర్ తెలిపారు.

సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కదిరి మున్సిపాలిటీలోని కదిరి గ్రామ పొలం సర్వే నెం.83 లో ఆక్రమాదారులు అక్రమంగా ఇల్ల నిర్మాణం మరియు బేస్ మట్టాల నిర్మాణం జరుగుతున్నాయని గతములోనే ఫిర్యాదు రాగానే, మేము సదరు సర్వ్ నెం 83 ను క్షేత్ర స్థాయిలో పరిశీలించండమైనది.

Read Also :Srikakulam News: అరసవల్లి ఆదిత్యుని సన్నిధిలో ఉపరాష్ట్రపతి.. శ్రీకూర్మంలో ప్రత్యేక పూజలు!

Kadiri News: అక్కడక్కడ కొంత మంది ఆక్రమాదారులు అనధికారికంగా బేస్ మట్టాల వేయడం జరిగినది మరియు వాటిని మా సంరక్షణలోకి తీసుకొని విచారణ చేటున్నాము. మరియు సర్వే నెం.83 లో ఎంత విస్తీర్ణం అససైన్మెంట్ ఇచ్చాం మరియు ఎంత ఇంటి పట్టాలకు జాగా ఇచ్చాం మిగిలిన ప్రభుత్వ భూమి ఎంత ఉంది అన్న విషయం పై సర్వే చేయిస్తున్నాం. తదుపరి రాజశ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలమేరకు సదరు అక్రమ కట్టడాలు పై చర్యలు తీసుకొనబడును. ప్రజలు కూడా ప్రభుత్వ భూములలో లే ఔట్ వేసిన ఇంటి జాగలను కానీ ఇళ్లను కానీ క్రయవిక్రయాలు లావాదేవీలు చేసిన యెడల చట్ట రిత్యా శిక్షా అర్హులు తహసిల్దార్ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha