Dailyhunt
ప్రకృతితో చెలగాటాలొద్దు!

ప్రకృతితో చెలగాటాలొద్దు!

వార్త 1 week ago

The nature : మానవ తప్పిదాల వల్లనే విపత్తులు ఒకదాని వెంట ఒకటి తోసుకువస్తున్నాయి. అపార ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణాలవుతున్నాయి. వాతావరణంలో తలెత్తుతున్నఅనేక మార్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారి తీస్తున్నాయి.

ఇందుకు ముందుగా నిందించాల్సింది, తప్పుపట్టాల్సింది మాన వుడినే. పర్యావరణాన్ని కాపాడకపోతే మానవుడి మను గడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఎందరో పర్యావరణ శాస్త్రవేత్తలు దశాబ్దాల తరబడి పదేపదే చెబుతున్నా పట్టించుకునేవారే లేకుండాపోతున్నారు.
పర్యావరణాన్ని కాపాడడం అటుంచి తూట్లు పొడవడం దురదృష్టకరం. ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరుగు తున్న అణుయుద్ధంలో ఎంతటి విధ్వంసం జరుగుతు న్నది వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పర్యావరణానికి ఎంతటి చేటు తెస్తుందో శాస్త్రజ్ఞుల అంచనాలకు అంద డం లేదు. ఇక అభివృద్ధి పేరుతో పాలకులు చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నాయి. ఇష్టానుసారంగా తవ్వకాలు మొదలు పెడితే కొండలను తొలచి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, నగరీకరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఎకరాల పంట పొలాలను జనవాసాలుగా మార్చడం ఒకటేమిటి ఎన్ని విధాలుగా పర్యావరణానికి నష్టం చేయగలుగు తారో అన్ని మార్గాల్లో నిత్యం అన్వేషణ విధ్వంసం జరు గుతున్నాయి.

Read Also : Telangana Ration Shops: రేషన్ షాపుల వద్ద బారులు.. ఎండలోనే బియ్యం కోసం పడిగాపులు

 The nature

The nature : పర్యావరణానికి విఘాతం

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత దేశ జనాభాయే మరో దశాబ్దం నాటికి నూటయాభై కోట్ల వరకు చేరుకుంటుందని అందుకు తగినట్టుగా దేశంలో సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుందని ప్రధానంగా అటవీ సంపద హరించుకు పోతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్లో ప్రతిరోజూ దాదాపు మూడువందల ఎకరాలకు పైగా అటవీ భూములు అదృశ్యమైపోతున్నా యని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడించింది. బొగ్గు గనులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, నదీ లోయ ప్రాజెక్టుల కోసం యధేచ్ఛగా అడవులను నరికి వేస్తున్నారు. ఇలాంటి కారణాలు ఎన్నో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ కాగితాలు మట్టి లో కలిసి పోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడు తుంది. కొన్ని ప్లాస్టిక్వ స్తువులను నిషేధించినా అవి కాగితాలకే పరిమితమవు తున్నాయి. ఈ ప్లాస్టిక్ పర్యావర ణానికి ఎంత నష్టం చేకూరుస్తున్నదో ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికార వర్గాలు విఫలమవుతున్నాయని చెప్పొచ్చు. పెట్రోలు, డీజిల్, ఇథనాల్ వాడకం గురించి చెప్పక్కర్లేదు. వాహన కాలుష్య నియంత్రణ మాటలకే పరిమితమవుతున్నది. ఎన్ని చట్టాలు చేసినా, మరెం దరిపై జరిమానాలు విధించినా పెరుగుతున్న వాహనాల సంఖ్య రెట్టింపు స్థాయిలో వాహన కాలుష్యాన్ని పెంచుతున్నది.

తుఫాన్లు భూకంపాలు లాంటి ఉపద్రవాలు

ఇక పరిశ్రమలు వదులుతున్న పొగ, ధూళి కణాలు, తదితరవన్నీ కలిసి వాయుకాలుష్యాన్ని విస్తరిస్తు న్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో పరిస్థితి దారుణంగా తయారవుతున్నది. నీటి కాలుష్యం పరిస్థితి అదుపు తప్పుతున్నదేమో. పెరుగుతున్న మురికివాడలనుంచి వెలువడుతున్న కలుషిత నీరు అంచలంచెలుగా నదుల్లోకి చేరుకొని పెద్దపెద్ద నదులను మురికి కూపాలుగా మారు స్తున్నాయి. ఈ నది, ఆ నది అని కాదు. దేశంలోని నదుల్లో నీటి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇలాంటి ఎన్నో కారణాలతో భూ ఉష్ణోగ్రత పెరిగి ప్రపంచంలోని తీర ప్రాంతాలు దీవులతోసహా అనేక దేశాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇలా ప్రకృతితో మనిషి ఆటలాడుకుంటుంటే ఇందుకు ప్రతీగా ప్రకృతి రెట్టింపు స్థాయిలో స్పందిస్తున్నది. పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్న కార ణంగా సకాలంలో వర్షాలు కురియడం లేదు. కురిస్తే ఒకే ప్రాంతంలో కుంభవృష్టి కురవడం, వరదలు, తుఫాన్లు భూకంపాలు లాంటి ఉపద్రవాలు చోటు చేసుకొంటున్నాయి. యేటా దాదాపు మూడువందల ఎనభైకి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉపద్రవాలు సంభవిస్తున్నట్లు అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి.

 The nature

భారీ మూల్యం

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఉపద్రవాలతో ప్రాణాలు పోగొట్టుకుంటే కోట్ల సంఖ్యలో రోగపీడితులు అవుతున్నారు. పాకిస్థాన్, ఇరాన్, హైతీ, న్యూజిలాండ్, నేపాల్ లాంటి ఎన్నో దేశాలలో వస్తున్న భూ కంపాలు విలయాన్నే సృష్టిస్తున్నాయి. సిరియాలో భూకంపం కారణంగా దాదాపు తొమ్మిదివేల మందికిపైగా అసువులు బాసారు. మెరోకోలో వచ్చిన భూకంప ప్రకంపనాలతో దాదాపు నాలుగువేల మంది జీవితాలు సజీవమయ్యాయి. పశ్చిమ ఆఫ్ఘానిస్థాన్లో భూప్రకంపనాలు విలయాన్నే సృష్టించాయని చెప్పొచ్చు. భారత్కు సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపన వార్తలు వింటూనే ఉంటున్నాం. చెన్నై, ముంబయి, కోల్కతా, పూణె, ఢిల్లీ లాంటి దాదాపు డెబ్బై నగరాలకు భూప్రకంప నాలు పొంచి ఉన్నట్లు శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక వరదలు, తుఫాన్ తోవ్యవ సాయ రంగం కుదేలైపోతున్నది. తుఫాన్ల బారి నుంచి తీరప్రాంతాలు తప్పించుకోలేకపోతున్నాయి. గతంలో దివి సీమలో సంభవించిన తుఫాన్ సిరిధాన్యాలతో తులతూగే ఆ ప్రాంతాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. ఇప్పటికీ ఆ బీభత్సం గురించి మరచిపోలేకపోతున్నారు. ఏదిఏమైనా ఉపద్రవాల నియంత్రణకు పర్యావరణాన్ని కాపాడేందుకు త్రికరణ శుద్ధిగా కృషి చేయాలి. అన్నింటికంటే ముఖ్యం గా ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మరెన్నో విలయాలు తప్పవు. భారీ మూల్యం చెల్లించక తప్పదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ లో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు.. 190 మందికి పాజిటివ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha