Ketan Agarwal case: పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఘోర హత్య ఉదంతంలో ఒక ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కేతన్ కాబోయే భార్య సియా గోయల్ తరఫున కోర్టులో వాదించేందుకు ఇద్దరు ప్రముఖ న్యాయవాదుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఈ క్రమంలోనే సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్పై ప్రముఖ న్యాయవాది అశుతోశ్ శ్రీవాస్తవ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయడం మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
లోహ్గఢ్ కోట (Lohagad Fort) కొండపై నుంచి కిందకు తోసి కేతన్ అగర్వాల్ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సియా గోయల్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ హైప్రొఫైల్ కేసులో సియా గోయల్ తరఫున కోర్టులో వకాలత్ పుచ్చుకునేందుకు లాయర్ల మధ్య విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందంటూ అడ్వకేట్ అశుతోశ్ శ్రీవాస్తవ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pune murder case: Rs 10 crore fine imposed on Siya Goyal’s brother.
Ketan Agarwal case: సాహిల్ గోయల్కు లీగల్ నోటీసులు
తమ మధ్య జరిగిన చర్చలు, ఇతర వ్యవహారాల్లో తన పరువుకు నష్టం కలిగించేలా ప్రవర్తించారంటూ సియా గోయల్ సోదరుడైన సాహిల్ గోయల్కు న్యాయవాది అశుతోశ్ శ్రీవాస్తవ అధికారికంగా లీగల్ నోటీసులు పంపించారు. తన క్లయింట్ ప్రయోజనాలకు, తన వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించినందుకు గానూ రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. పుణేలో ఎంతో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు నిందితురాలి చుట్టూనే కాకుండా, ఇప్పుడు లీగల్ టీమ్ చుట్టూ కూడా తిరుగుతోంది. కాబోయే భర్తను లోహ్గఢ్ కోటపై నుంచి తోసేసి హత్య చేసినట్లు ఎదుర్కొంటున్న ఆరోపణల కేసు విచారణ ఒకవైపు సాగుతుండగా, లాయర్ల మధ్య రేగిన ఈ పరువు నష్టం వివాదం కోర్టు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

