Rahul : ఇండియా (I.N.D.I.A) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలు కూటమిని బలోపేతం చేయకపోగా, అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కే పరోక్షంగా లాభం చేకూరుస్తున్నాయని కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం (CPI-M) సీనియర్ నాయకుడు పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కూటమిలోని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోందని ఆయన మండిపడ్డారు. తమిళనాడులో డీఎంకే (DMK)తో బంధం బలహీనపడటం, బిహార్లో ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ వంటి కీలక భాగస్వాములు కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే ఇందుకు నిదర్శనమని విజయన్ ఎండగట్టారు.
Read Also : విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్!

‘హగ్’ వివాదంపై విజయన్ రియాక్షన్: కూటమిలో ముదురుతున్న విభేదాలు!
ఇటీవల జరిగిన ఇండియా కూటమి అంతర్గత సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ గట్టిగానే స్పందించారు. “విజయన్తో ఉన్న రాజకీయ విభేదాల కారణంగా నేను ఆయనను కౌగిలించుకోలేను (హగ్ చేసుకోలేను)” అని రాహుల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, విజయన్ ఇచ్చిన ఈ తాజా కౌంటర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పరస్పర గౌరవం, ప్రాంతీయ శక్తుల బలాన్ని గుర్తించకుండా వ్యక్తిగత అజెండాలతో ముందుకెళితే కూటమి మనుగడకే ప్రమాదమని విజయన్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఢీకొట్టాలనే లక్ష్యంతో ఏర్పడిన కూటమిని కాంగ్రెస్ తన అనాలోచిత వ్యూహాలతో బలహీనపరుస్తోందని, ఈ వైఖరి మార్చుకోకపోతే విపక్షాల ఐక్యత కేవలం కాగితాలకే పరిమితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

