Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్!

విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్!

వార్త 2 months ago

Four Maoists granted bail: గత ఏడాది విజయవాడలో సంచలనం సృష్టించిన మావోయిస్టుల అరెస్ట్ ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 200 రోజులకు పైగా జైలులో రిమాండ్‌లో ఉన్న నలుగురు మావోయిస్టులకు మచిలీపట్నం జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పొందిన వారిలో పొడియం రెంగు అలియాస్‌ బీమ (A1), మదకం మదన్‌ అలియాస్‌ మదనన్న (A2), సోది మనీలా (A3), సోది మంగి (A4) ఉన్నారు.

Read Also: Dundigal Air Force Academy : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్​నాథ్​

 Four Maoists granted bail

గత ఏడాది నవంబర్‌లో హైడ్రామా అరెస్ట్

గత ఏడాది నవంబర్ 18వ తేదీన విజయవాడ కానూరు సమీపంలోని కొత్త ఆటోనగర్‌లో ఉన్న ఒక భవనంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కా సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసుల సహాయంతో సదరు భవనాన్ని ముట్టడించి వ్యూహాత్మకంగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిపై పటమట పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నెల్లూరు కేంద్ర కారాగారానికి జ్యుడీషియల్ రిమాండ్‌పై తరలించారు.

Four Maoists granted bail: డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయపోరాటం

నిందితులు 200 రోజులకు పైగా జైలులోనే ఉన్నప్పటికీ, పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై కోర్టు కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దానిని వెనక్కి పంపింది. చట్టబద్ధమైన గడువు ముగిసినా సరైన ఛార్జిషీట్ దాఖలు కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, నిందితుల తరఫు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ కోర్టులో ‘డిఫాల్ట్ బెయిల్’ (Default Bail) పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ కగార్' (Operation Kagar) ఒత్తిడి కారణంగానే చాలా మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోతున్నారని, నిందితులు సుదీర్ఘకాలంగా జైలులో ఉన్నందున వారికి బెయిల్ పొందే హక్కు ఉందని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వరరావు ఈ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి నిందితుల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేశారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా కోర్టు క్రింది కఠిన షరతులను విధించింది. ప్రతి నిందితుడు రూ. 25,000 చొప్పున రెండు పూచీకత్తులను (Sureties) సమర్పించాలి. అందులో ఒక పూచీకత్తుదారు తప్పనిసరిగా స్థానిక వ్యక్తి అయి ఉండాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'లియాకి ఫ్రీడమ్' నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha