Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభ పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా రాఘవ్ చద్దా!

రాజ్యసభ పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా రాఘవ్ చద్దా!

వార్త 2 days ago

Raghav Chadha Rajya Sabha: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా, పార్లమెంట్‌లో సామాన్యుల తరఫున గళమెత్తి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా రాజకీయ ప్రయాణంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది.

ఇటీవల ఆప్ వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త బాధ్యతలను అప్పగించింది. బీజేపీలో చేరినందుకు ప్రతిఫలంగానే కేంద్రం ఆయనకు ఈ కీలక పదవిని బహుమతిగా ఇచ్చిందంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సెటైర్లు, చర్చలు మొదలయ్యాయి.

రాజ్యసభ పిటిషన్ల కమిటీ ఛైర్మన్‌గా నియామకం

ఎంపీ రాఘవ్ చద్దాను పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన రాజ్యసభ పిటిషన్ల కమిటీ (Committee on Petitions) ఛైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిటిషన్ల కమిటీని పునర్‌వ్యవస్థీకరించిన అనంతరం, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సభలోని మొత్తం 10 మంది సభ్యులతో కూడిన ఈ నూతన కమిటీకి చద్దాను ఛైర్మన్‌గా నామినేట్ చేస్తూ పార్లమెంట్ సెక్రటేరియట్ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కమిటీ పునర్‌వ్యవస్థీకరణ మే 20 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పిటిషన్ల కమిటీలోని ఇతర సభ్యులు వీరే..

రాఘవ్ చద్దా ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ ఉన్నత స్థాయి కమిటీలో దేశంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ ఎంపీలకు సభ్యులుగా స్థానం కల్పించారు.

  • హర్ష్ మహాజన్
  • గులాం అలీ
  • శంభు శరణ్ పటేల్
  • మయంకుమార్ నాయక్
  • బీదా మస్తాన్ రావు యాదవ్
  • జెబి మాథర్ హిషాం
  • సుభాసిష్ ఖుంటియా
  • ర్వంగ్వ్రా నార్జరీ
  • పి. సంతోష్ కుమార్

 Raghav Chadha Appointed Chairman of Rajya Sabha Committee on Petitions - Centre Takes Key Decision

Raghav Chadha Rajya Sabha: ఆప్ విలువలు పూర్తిగా నీరుగారాయి: రాఘవ్ చద్దా

గత ఏప్రిల్ 26న రాఘవ్ చద్దా మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారికంగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. పార్టీని వీడే సమయంలో ఆయన ఆప్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అవినీతిని నిర్మూలిస్తామనే గంభీరమైన ప్రతిజ్ఞలు, ఆదర్శాలతో ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు పూర్తిగా తన మూల సూత్రాలు, విలువలకు దూరమైందని మండిపడ్డారు. ప్రస్తుతం పార్టీ పూర్తిగా అవినీతిపరులు, స్వార్థపరుల చేతుల్లోకి దారుణంగా పడిపోయిందని విమర్శించారు. అలాంటి వారి తప్పులలో తాను భాగస్వామి కావడం ఇష్టం లేకే, సుమారు ఏడాది క్రితమే తాను మానసికంగా ఆప్‌కు దూరమయ్యానని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha