Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ!

51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ!

వార్త 2 days ago

Modi Rojgar Mela 2026: దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'రోజ్‌గార్ మేళా' (Rojgar Mela 2026) శనివారం ఘనంగా జరిగింది.

దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని, 51 వేల మందికి పైగా యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను (Appointment Letters) వర్చువల్‌గా అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతకు, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రైల్వేలు, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి దేశ ప్రగతికి అత్యంత కీలకమైన రంగాలలో ఈ యువత కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారని చెప్పారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో రాబోయే రోజుల్లో ఈ యువ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం కానుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: SBI Staff Strike: సమ్మెకు పిలుపునిచ్చిన SBI ఉద్యోగులు

 Modi Rojgar Mela 2026

భారత యువతపై ప్రపంచ దేశాల నమ్మకం

ఇటీవల తాను ముగించుకున్న ఐదు దేశాల అంతర్జాతీయ పర్యటనను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయా దేశాల రాజకీయ నాయకులు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు భారత్‌పై ఎనలేని విశ్వాసం చూపిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ నేడు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆరాటపడుతున్నాయి. భారత యువత సాంకేతిక ప్రగతి, వారి నైపుణ్యాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. మన యువతకు గ్లోబల్ స్థాయిలో మరిన్ని కొత్త అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.

Modi Rojgar Mela 2026: అంతర్జాతీయ ఒప్పందాలు – భారీగా ఉద్యోగాల సృష్టి

భారతదేశ సాంకేతిక రంగాన్ని మరియు ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు కుదిరిన పలు అంతర్జాతీయ ఒప్పందాల గురించి ప్రధాని మోదీ వివరించారు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ASMLతో భారత టాటా గ్రూప్ (Tata Group) చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇది దేశంలో తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానానికి ద్వారాలు తెరవడమే కాకుండా భారీగా ఉద్యోగాలను సృష్టిస్తుంది. స్వీడన్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తో కలిసి సూపర్ కంప్యూటింగ్ రంగంలో సహకారం మరింత పెరుగుతోంది. భారత్ ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, క్రిటికల్ మినరల్స్, మరియు సస్టైనబుల్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగంగా దూసుకుపోతోందని ప్రధాని చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఢిల్లీలో ఏకంగా 7.7 లక్షల రేషన్ కార్డులు రద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha