Train Luggage Rules: భారతీయ రైల్వే (Indian Railways) లో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ లగేజీ రవాణా నిబంధనలలో (Luggage Rules) కీలక మార్పులు చేస్తూ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చడంతో పాటు.. ముఖ్యంగా దేశంలోని క్రీడాకారుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
క్రీడాకారులకు రైల్వే శాఖ శుభవార్త
Train Luggage Rules: Indian railway prohibited items list inside coach
రైల్వే శాఖ జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం, క్రీడాకారులు తమ క్రీడా పరికరాలను రైళ్లలో తరలించే ప్రక్రియను సులభతరం చేశారు.
- పెద్ద క్రీడా పరికరాలకు అనుమతి: క్రీడాకారులు తమతో పాటు పెద్ద పరిమాణంలో ఉండే ప్రామాణికం కాని, సున్నితమైన క్రీడా పరికరాలను (ఉదాహరణకు: జావెలిన్లు – Javelins) రైళ్లలో సులభంగా రవాణా చేయవచ్చు నిర్దేశించిన రవాణా ఛార్జీలు చెల్లించిన తర్వాత వీటికి అనుమతి లభిస్తుంది.
- లగేజీ కంపార్ట్మెంట్లో ప్రాధాన్యత: క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ పరికరాలను రైలు లగేజీ కంపార్ట్మెంట్లో ఉంచేలా రైల్వే సిబ్బంది ప్రాధాన్యత ఇస్తారు.
- బరువు పరిమితి సడలింపు: సాధారణ లగేజీకి వర్తించే గరిష్ట బరువు పరిమితి నియమం ఈ క్రీడా పరికరాలకు వర్తించదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
- పోల్-వాల్ట్ పోల్స్పై నిషేధం: అయితే, పొడవు మరియు సాంకేతిక కారణాల వల్ల ‘పోల్-వాల్ట్’ (Pole-Vault) పోల్స్ను ప్యాసింజర్ కోచ్లలో సురక్షితంగా తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి, కొత్త నిబంధనల ప్రకారం వీటి రవాణాపై నిషేధం యథాతథంగా కొనసాగుతుంది.
సాధారణ ప్రయాణికులు గమనించాల్సిన నిషేధిత వస్తువులు
రైలు ప్రయాణంలో కొన్ని రకాల ప్రమాదకరమైన, మండే స్వభావం గల వస్తువులను తీసుకెళ్లడంపై రైల్వే శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు (రైల్వే చట్టం కింద జైలు శిక్ష) కూడా ఉంటాయి.
Train Luggage Rules: రైలు ప్రయాణంలో పూర్తిగా నిషిద్ధమైన వస్తువులు:
- మండే స్వభావం గల పదార్థాలు: పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ఎలాంటి ఇంధనాలను తీసుకెళ్లడం పూర్తిగా నిషిద్ధం.
- పేలుడు పదార్థాలు: దీపావళి టపాసులు (Crackers), గన్పౌడర్ వంటి ప్రమాదకర వస్తువులపై నిషేధం ఉంది.
- గ్యాస్ సిలిండర్లు: రైలు కోచ్లలో వంట గ్యాస్ సిలిండర్లను (Gas Cylinders) రవాణా చేయడం చట్టవిరుద్ధం.
- అనధికార ఆయుధాలు: ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేని ఆయుధాలు, కత్తులు లేదా ఇతర భద్రతకు ముప్పు కలిగించే వస్తువులను కలిగి ఉండటం తీవ్రమైన నేరం.
రైల్వే హెచ్చరిక: ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు తమ విలువైన వస్తువుల (బంగారం, నగదు, లాప్టాప్లు) పట్ల అజాగ్రత్తగా ఉండకూడదని, లేదంటే దొంగతనాలకు గురయ్యే ప్రమాదం ఉందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది.

