Rythu bharosa telangana:రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులకు రైతుభరోసా పథకం పై తీవ్రమైన ఎదురుచూపులు ఉన్నాయి. జూన్ పదిహేను లోపు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు గతంలో సూచించారు.
అర్హులైన రైతులు గడువులోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసి నిధుల విడుదల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
Read also: Rains : 'హమ్మయ్యా.. ఇప్పుడు వానాకాలం లాగా అనిపిస్తోంది' !!
When will new pattadars receive Rythu Bharosa?
నిధుల విడుదలపై ప్రభుత్వ తాజా నిర్ణయం
జూన్ ముప్పై నుంచి ప్రభుత్వం రైతుభరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాలు విడతల వారీగా జమ చేయడం ప్రారంభించింది. పాత రైతులకు డబ్బులు పడుతున్నప్పటికీ కొత్త వారికి ఇంకా జమ కాలేదు. అధికారులు సూచించిన గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలో ప్రత్యేక జాబితా విడుదల చేసి నిధులు జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
Rythu bharosa telangana:అన్నదాతల ఎదురుచూపులు
రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకదారులు అందరికీ త్వరలోనే మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు సాయం అందేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. త్వరలోనే కొత్త వారికి కూడా నిధులు విడుదల కానున్నాయి అనే వార్తతో రైతులు ఊరట చెందుతున్నారు.
Epaper: epaper.vaartha.com
హైడ్రాను కొనసాగిస్తాం..హైకోర్టు తీర్పుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

