Republic Day in Amaravati: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
సోమవారం జరగనున్న ఈ వేడుకలు అమరావతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనున్నాయి. ఇప్పటివరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ఈసారి అమరావతికి తరలించడం విశేషంగా మారింది.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలోని విశాలమైన పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించగా, ఒకేసారి దాదాపు 13 వేల మంది కూర్చునేలా సౌకర్యవంతమైన గ్యాలరీలను ఏర్పాటు చేశారు.


Republic Day in Amaravati: First Republic Day in the new Andhra capital
అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవంగా వీఐపీ గ్యాలరీలను ఏర్పాటు చేయడం ఈ వేడుకల ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రైతులు సౌకర్యవంతంగా వేడుకలను తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఈ ఏర్పాట్లను పూర్తి చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలు శాంతియుతంగా, భద్రంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా అమరావతి రాజధానిగా మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందనుందని, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది శుభారంభంగా నిలుస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

