Dailyhunt
రేవంత్ రెడ్డితో మీనాక్షీ నటరాజన్ భేటీ.. పదవుల భర్తీపై కసరత్తు!

రేవంత్ రెడ్డితో మీనాక్షీ నటరాజన్ భేటీ.. పదవుల భర్తీపై కసరత్తు!

వార్త 1 week ago

TG Politics: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.

ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ అంతర్గత విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యల గురించి వీరు సమీక్షించినట్లు తెలుస్తోంది.

Read also: TG Delimitation 2026: డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి సీట్లు తగ్గితే పోరాటం తప్పదు: కేటీఆర్ హెచ్చరిక

Revanth Reddy meets Meenakshi Natarajan

TG Politics: నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల భర్తీ

ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. వివిధ కార్పొరేషన్లకు కొత్త పాలకవర్గాలను నియమించడం మరియు పదవీకాలం ముగిసిన ఛైర్మన్ల రెన్యూవల్ పై ఒక స్పష్టతకు వచ్చారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ నియామకాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిస్థితులు

జిల్లాల వారీగా పార్టీలో జరుగుతున్న సమీక్షా సమావేశాల పురోగతిని మీనాక్షీ నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డికి సంబంధించిన తాజా పరిణామాలతో పాటు పార్టీ మార్పులపై కూడా చర్చించారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రైవేట్ కంపెనీలను తరిమేస్తాం: జగన్ ధీమా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha