Rowdy Janardhan : రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రౌడీ జనార్ధన'.
ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్లో జోరుగా ప్రచారమవుతోంది. ఈ చిత్రంలో రాబోయే ఒక మాస్ మసాలా స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘లైగర్’ సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ, స్క్రీన్పై విజయ్-అనన్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ను ఒక అదిరిపోయే స్పెషల్ నంబర్ కోసం పునరావృతం చేయాలని చిత్ర మేకర్స్ భావిస్తున్నారు.

దిల్రాజు నిర్మాణంలో భారీ అంచనాలు.. అనన్యతో సంప్రదింపులు సక్సెస్?
ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం ఇప్పటికే అనన్య పాండేను సంప్రదించిందని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా స్పందించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రవి కిరణ్ కోలా మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు విజయ్ దేవరకొండ వింటేజ్ యాక్షన్ స్టైల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ తరుణంలో అనన్య పాండే స్పెషల్ అప్పీయరెన్స్ గనుక అధికారికంగా ఖరారైతే, ‘రౌడీ జనార్ధన’పై అంచనాలు మరియు బాలీవుడ్ మార్కెట్ క్రేజ్ మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు.
బండ్ల గణేష్కు చుక్కెదురు.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

