సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పుడు జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మే నెలలో సమంతను స్క్రీన్పై చూడాలనుకున్న అభిమానులకు గట్టి షాక్ తగిలినట్లయింది.
Read Also : జాన్వీ కపూర్ పెళ్లి పుకార్లకు చెక్ పెట్టిన బోనీ కపూర్!

వాయిదాకు అసలు కారణం ఇదేనా?
ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్-2026 అని తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న సమయంలో సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 31 వరకు ఐపీఎల్ సందడి కొనసాగనుంది. ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం క్రికెట్పై ఆసక్తి చూపిస్తుండటంతో, కలెక్షన్ల పరంగా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే చిత్ర యూనిట్ జూన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనేది ప్లాన్.
జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ
జూన్ నెలలో సినిమాను విడుదల చేయడం వల్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడ సమంతకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, అక్కినేని అఖిల్ ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’ కూడా జూన్ నెలలోనే విడుదల కానున్నాయి. ఇద్దరు భారీ హీరోల సినిమాల మధ్యలో సమంత సినిమా రావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ‘మా ఇంటి బంగారం’ ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఏదేమైనా సమంత క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్: 'ఫౌజీ' ఫస్ట్ సింగిల్కు ముహూర్తం ఫిక్స్!

