AP Telangana Seed Corporation: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విభజన అంశాన్ని పరస్పర సహకారంతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి ఎండి యాస్మీన్ బాషా నిర్ణయించారు.
ఈ మేరకు సంస్థ విభజన అంశంపై బుధవారం హైదరాబాద్ లోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Read Also: Markapuram Bus Accident: బస్సు ప్రమాదం: 14 మంది మృతికి ఆ 'పిసినారితనమే' కారణం
Seed Development Corporation Bifurcation
AP Telangana Seed Corporation: పెండింగ్ సమస్యల పరిష్కారం
పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. వివిధ కారణాల వలన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన పరిపాలన భవన పంపకాల సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు కొనసాగాయి. అయితే విభజన ప్రక్రియ పురోగతిలో ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించిన వాటాల పంపకం జరగకపోవడం ప్రధాన సమస్యగా మారిందని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ అభిప్రాయానికి వచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

