Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు వీరే

సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు వీరే

వార్త 2 weeks ago

AP Fishermen Missing: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం మరియు ఆందోళన నెలకొంది. వేట కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు అనూహ్య పరిస్థితుల్లో గల్లంతయ్యారు.

ఈ ప్రమాదం నుంచి బోటు యజమాని చిన్న అనే మత్స్యకారుడు మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి సమాచారం అందడంతో అప్రమత్తమైన భారత రక్షణ శాఖకు చెందిన కోస్ట్ గార్డ్ (Coast Guard), ఇండియన్ నేవీ (Navy) హెలికాప్టర్లు, ప్రత్యేక నౌకలతో సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Read Also :Atchannaidu: సముద్రంలో గల్లంతైన విశాఖ మత్స్యకారులందరూ క్షేమం: మంత్రి అచ్చెన్నాయుడు

బాధితులు విజయనగరం, విశాఖ జిల్లాల వాసులు

గల్లంతైన వారిలో విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన కారె సీతోడు, కారె చిన్నయ్య, కారె గరగయ్య, అయ్మోరు చిన్న, అమర అప్పలరాజుతో పాటు విశాఖ జిల్లా నాగమయ్య పాలేనికి చెందిన బండయ్య కూడా ఉన్నారు.సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులలో ఐదుగురు విజయనగరం జిల్లాకు చెందినవారు కాగా, మరొకరు విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. వీరి అదృశ్యంతో వారి సొంత గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

AP Fishermen Missing: ముమ్మరంగా సాగుతున్న గాలింపు చర్యలు

సముద్రంలో వాతావరణ మార్పులు లేదా బోటు ప్రమాదానికి గురవడం వల్లే ఈ అపశ్రుతి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన బోటు యజమాని చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ప్రమాదం జరిగిన అక్షాంశాలు, రేఖాంశాలను (Coordinates) లెక్కగట్టిన నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ప్రాంత పరిసరాల్లో గాలిస్తున్నారు. స్థానిక మత్స్యకార పడవలు, మెరైన్ పోలీసులు కూడా ఈ శోధన చర్యల్లో భాగస్వామ్యమయ్యారు. గల్లంతైన వారిని వీలైనంత త్వరగా సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

జాలర్లు సురక్షితంగా బయటకు రావడం సంతోషం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha