Census 2027: భారత జనాభా గణన (CENSUS)-2027లో భాగంగా చౌటకూర్ మండలంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఎన్.
కిష్టయ్య ప్రారంభించి, శిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని, అందులో భాగస్వామ్యం అవుతున్న సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. శిక్షణలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి తప్పిదాలు లేకుండా డేటా సేకరణ చేయాలని అన్నారు. సరైన సమాచారం సేకరణ వల్ల ప్రభుత్వానికి ప్రజల అవసరాలు, సమస్యలు స్పష్టంగా తెలిసి, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన సులభమవుతుందని తెలిపారు.
Read Also :CM Revanth: హైడ్రా బాధితులకు ఊరట.. ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు
Census 2027: Census-2027 training program begins in Sangareddy
ఫీల్డ్ ట్రైనర్లు గోపికృష్ణ, లక్ష్మీనారాయణ సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు ప్రాక్టికల్ విధానాలు, ఫార్మాట్ నింపే విధానం, డేటా నమోదు పద్ధతులపై సమగ్రంగా శిక్షణ అందిస్తున్నారు. శిక్షణలో ఆధునిక సాంకేతిక పద్ధతులు, మొబైల్ యాప్ వినియోగం, గణనలో ఎదురయ్యే సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది శిక్షణ పట్ల ఆసక్తి చూపుతూ, తమ సందేహాలను ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకున్నారు. అధికారులు శిక్షణను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు రాబోయే రోజుల్లో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

