Dailyhunt
Sangareddy Road Accident: బస్సు ఢీకొని యువతి మృతి

Sangareddy Road Accident: బస్సు ఢీకొని యువతి మృతి

వార్త 3 months ago

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru)లో జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న 27 ఏళ్ల లిఖిత అనే యువతి అక్కడిక్కడే మృతి చెందింది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె స్కూటీపై వెళ్తుండగా జారి పడటం వల్ల వెనకాలే వస్తున్న ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు ఆమెను ఢీకొట్టింది.

Read Also:iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

టైరు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు

బస్సు టైరు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి, సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బస్సు డ్రైవర్‌ను గుర్తించి విచారణ జరుపుతున్నారు.

స్థానికులు మరియు సమీప ప్రయాణికులు ఘటనను చూసి తీవ్ర భయానికి గురయ్యారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల పరిశీలనలో రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సేఫ్టీ చిహ్నాలు సరిగ్గా ఉన్నాయా లేదా, వేగ నియంత్రణ సక్రమంగా ఉందా అనే అంశాలను కూడా సమీక్షిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Hyderabad Crime: యజమానురాలను హత్య చేసి బంగారం దోచిన డ్రైవర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha