Dailyhunt
సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలు తీసింది!

సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలు తీసింది!

వార్త 1 week ago

Mullugummi Waterfall Accident: సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ యువతులను మృత్యువు జలపాతం రూపంలో కబళించింది. సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి ముగ్గురు యువతులు మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ముల్లుగుమ్మిలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also: Bangalore incident: విషాదం.. మూడవ అంతస్తు నుండి కిందపడ్డ చిన్నారి (వీడియో)

 Selfie fun took the lives of three young women!

ఫోటోల కోసం వెళ్తే.. మృత్యుఒడిలోకి

హుకుంపేట మండలం జంబవలస గ్రామానికి చెందిన నలుగురు యువతులు ముల్లుగుమ్మి జలపాతంలో స్నానం చేయడానికి వెళ్లారు. జలపాతం వద్ద ఉన్న ఒక పెద్ద బండరాయిపై నిలబడి మొబైల్ ఫోన్‌లో సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఊహించని ప్రమాదం సంభవించింది. పాదాలు జారి ముగ్గురు యువతులు లోతైన నీటి ప్రవాహంలో పడిపోయారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారు బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Mullugummi Waterfall Accident: ఒక యువతి సురక్షితం

ఈ ప్రమాదం జరిగిన సమయంలో వారితో ఉన్న మరో యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. కళ్లముందే స్నేహితురాళ్లు నీటిలో మునిగిపోవడంతో ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. మృతులంతా ఒకే గ్రామానికి (జంబవలస) చెందిన వారు కావడంతో ఆ పల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు, ముఖ్యంగా జలపాతాల వద్ద సెల్ఫీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఫోన్ పాస్‌వర్డ్ చిచ్చు: ముగ్గురు కుమార్తెల కళ్లెదుటే భార్య దారుణ హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha