Dailyhunt
షాద్ నగర్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

షాద్ నగర్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

వార్త 1 week ago

Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదివారం ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న దూసకల్ గ్రామానికి చెందిన అభి యాదవ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు సబ్జెక్టులలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ గ్రామస్తులు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య విషయం తల్లిదండ్రులు అదేవిధంగా కళాశాల యాజమాన్యం బయటకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ట్రక్కు-కారు భీకరంగా ఢీకొని ఏడుగురు మృతి.. సురేంద్రనగర్‌లో విషాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha