Sangareddy Cylinder Blast: సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో సంగమేశ్, మల్లమ్మ, బిందు, చిన్న లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఘటన చోటుచేసుకున్న వెంటనే స్థానికులు అప్రమత్తమై గాయపడిన వారిని అత్యవసరంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Sangareddy Cylinder Blast: ఘటనా స్థలిలో ఎమ్మెల్యే సమీక్ష
విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పేలుడు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు..అనంతరం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే , వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాధితులను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది …
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

