Dailyhunt
శ్రీశైలం జలవనరుల శాఖ క్వార్టర్స్ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

శ్రీశైలం జలవనరుల శాఖ క్వార్టర్స్ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

వార్త 1 week ago

క్రమణ తొలగింపులకు అధికారులు సిద్ధమై ఉండాలి.

Srisailam Irrigation Quarters: నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, శ్రీశైల మండలం, సుండి పెంట గ్రామంలో జలవనరుల శాఖకు చెందిన క్వార్టర్స్, ఖాళీ స్థలాల్లో ఉన్న అనధికారిక ఆక్రమణలను చట్టపరంగా తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి.

రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్‌లో అధికారుల సమావేశంలో శ్రీశైలం జలవనరుల శాఖ క్వార్టర్స్‌తో పాటు ఖాళీ స్థలాలపై జరిగిన ఆక్రమణలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

Read Also: AP health services: వాట్సాప్‌లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం

Srisailam Irrigation Quarters: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, హైకోర్టు ఉత్తర్వుల మేరకు అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని చట్టపరమైన విధానంలో, పారదర్శకంగా తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. అదేవిధంగా, ఆక్రమణలపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి ఖచ్చితమైన వివరాలను సిద్ధం చేయాలని, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

ప్రభుత్వ భూములు, క్వార్టర్స్‌ను ఆక్రమణల నుండి విముక్తి చేయడం ద్వారా వాటిని అసలు ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో రాము నాయక్, ఆత్మకూరు ఆర్డీవో వెంకట శివ, శ్రీశైలం డ్యాం ఎస్ఈ బాలచంద్రారెడ్డి, ల్యాండ్ సర్వే ఏడి శ్రీరామ్, శ్రీశైలం తహసీల్దార్ కె.వి. శ్రీనివాసులు తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha