Dailyhunt
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో చలివేంద్రాలు ఏర్పాటు

శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో చలివేంద్రాలు ఏర్పాటు

వార్త 1 week ago

చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్యనిర్వహణాధికారి

Srisailam temple: అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం క్షేత్రమైన శ్రీశైలంలో భక్తుల సౌకార్యార్ధం దేవస్థానం పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసింది.

దేవస్థానo వైద్యశాల ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం నాడు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు ప్రారంభించారు.

Read Also: Srisailam Irrigation Quarters: శ్రీశైలం జలవనరుల శాఖ క్వార్టర్స్ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

 Cold buttermilk and fresh water for devotees at Srisailam

Srisailam temple:భక్తులకు మజ్జిగ, చల్లని మంచినీరు పంపిణీ

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ వేసవి తీవ్రత కారణంగా దేవస్థానం ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చలివేంద్రాలలో చల్లని మంచినీటితో పాటు, మజ్జిగ కూడా భక్తులకు అందజేయడం జరుగుతోందన్నారు. అదేవిధంగా కరివేన సత్రం, ఆర్టీసి బస్టాండు, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలైన చోట్ల కూడా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.

శివసేవకుల స్వచ్ఛంద సేవలు

ఈ చలివేంద్రాలలో శివసేవకుల స్వచ్ఛంద సేవలను వినియోగించుకోడం జరుగుతోందన్నారు. దేవస్థానం సూచనల మేరకు పలు సత్రాల వారు కూడా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులందరికీ కూడా ఈ చలివేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. నరసింహారెడ్డి, శివ సేవకుల విభాగపు పర్యవేక్షకులు టి.హిమబిందు, అన్నప్రసాద వితరణ విభాగపు పర్యవేక్షకులు పి.దేవిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha