Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో ఘన విజయం నమోదైంది. అమరావతి క్వాంటం వ్యాలీ (AQV)లో 'క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్' నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మధ్య ఒప్పందం కుదిరింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ క్వాంటం మిషన్, పీఎన్బీ అధికారులు పరస్పర అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన తొలి ఆర్థిక సంస్థగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది.

సైబర్ నేరాలకు అడ్డుకట్టే ప్రధాన ధ్యేయం
ఈ కార్యక్రమంలో పీఎన్బీ సీఈఓ మరియు ఎండీ అశోక్ చంద్ర, ఏపీ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పాల్గొన్నారు. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ హబ్, బ్యాంకింగ్ వ్యవస్థలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఆర్థిక మోసాలను ముందుగానే గుర్తించే వ్యవస్థల రూపకల్పన, డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు అత్యంత సురక్షితమైన రక్షణ కల్పించడం మరియు భవిష్యత్ డిజిటల్ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం ఈ కేంద్రం యొక్క ప్రాథమిక లక్ష్యాలు.
Chandrababu Naidu: ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి సరికొత్త వేదిక
ఈ ఇన్నోవేషన్ హబ్ కేవలం బ్యాంకింగ్ రంగం మాత్రమే కాకుండా విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్లు, పరిశోధకులు మరియు ప్రభుత్వ విభాగాలను ఒకే తాటిపైకి తీసుకువస్తుంది. క్వాంటం కంప్యూటింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన సాంకేతికతలలో పరిశోధనలను ప్రోత్సహించడం, యువతలో ఈ రంగాలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం కూడా ఈ కేంద్రం ద్వారా జరుగుతుంది.
అమరావతిని డీప్ టెక్నాలజీ హబ్గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని కేవలం పాలనా నగరంగానే కాకుండా క్వాంటం, డీప్ టెక్నాలజీలకు అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా పీఎన్బీ ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు విస్తృతమవుతున్న నేపథ్యంలో “డిజిటల్ అరెస్ట్” వంటి నూతన సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. క్వాంటం పరిజ్ఞానం ద్వారా డిజిటల్ నెట్వర్క్లకు కనీవినీ ఎరుగని రక్షణ కల్పించాలని సూచించారు.
సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ మా లక్ష్యం: పీఎన్బీ సీఈఓ
పీఎన్బీ సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ, డిజిటల్ బ్యాంకింగ్ను వినియోగదారులకు మరింత సులభంగా, సురక్షితంగా మరియు పటిష్టంగా అందుబాటులోకి తీసుకురావడానికే అమరావతిలో ఈ హబ్ను ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ కేంద్రం ద్వారా భారతదేశ బ్యాంకింగ్ రంగానికి అత్యాధునిక రక్షణ వ్యవస్థ అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Epaper: epaper.vaartha.com
"అమరావతి భూసేకరణతో మీకేం సంబంధం?": ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

