CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జూన్ 22న ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా?
తొలి దశలో 46 వేల కార్డుల పంపిణీ
పౌర సరఫరాల శాఖ సమాచారం ప్రకారం, మొదటి విడతలో పంపిణీ కోసం సుమారు 46 వేల నూతన రేషన్ కార్డులు సిద్ధం చేయబడ్డాయి. అర్హత కలిగిన లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ కార్డులను జారీ చేయనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 2.25 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాటి పరిశీలన కొనసాగుతోందని, దశలవారీగా మిగిలిన కార్డులను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.
CM Vijay: పెరంబూర్లో ప్రారంభ కార్యక్రమం
ముఖ్యమంత్రి విజయ్ తన అసెంబ్లీ నియోజకవర్గమైన పెరంబూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ ఎంపిక చేసిన కొంతమంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా రేషన్ కార్డులను అందజేయనున్నారు.
TVK ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
ఈ కార్యక్రమానికి అనుబంధంగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

