Dailyhunt
సీనియర్ కార్యకర్త రాజప్ప యాదవ్‌ను పరామర్శించిన మంత్రి సవిత

సీనియర్ కార్యకర్త రాజప్ప యాదవ్‌ను పరామర్శించిన మంత్రి సవిత

వార్త 2 weeks ago

Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని రొద్దం మండలం కొగిర గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజప్ప యాదవ్‌ను మంత్రి సవిత ఆదివారం స్వయంగా గ్రామానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి మంత్రి, రాజప్ప యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం, తెలుగుదేశం పార్టీ స్థాపన నాటి నుంచి పార్టీకి అండగా నిలిచి, కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్న రాజప్ప యాదవ్ సేవలను మంత్రి సవిత కొనియాడారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత ఆదర్శనీయం అని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also:TDP Formation Day: అనంతపురం నగరంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 Minister Savitha visits Rajappa Yadav

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అనంతపురం నగరంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha