Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిరిసిల్లలో బాలాజీ స్వీట్ హౌస్ నిర్వాకం.. కారప్పూస ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి

సిరిసిల్లలో బాలాజీ స్వీట్ హౌస్ నిర్వాకం.. కారప్పూస ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి

వార్త 3 weeks ago

Dead lizard Incident: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ (Food Safety) అంశం రోజురోజుకూ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాను వణికించిన పానీపూరి కాలుష్యం (ఫుడ్ పాయిజనింగ్) ఘటన మరువకముందే… తాజాగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో దారుణమైన ఉదంతం వెలుగుచూసింది.

స్థానిక ఒక ప్రముఖ స్వీట్ హౌస్‌లో కొనుగోలు చేసిన తినుబండారాల్లో చనిపోయిన విషపూరిత బల్లి (Dead Lizard) ప్రత్యక్షం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ ప్యాకెట్‌ను గమనించకుండా పిల్లలు తిని ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also:Dausa Rajasthan Bus Accident:ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!

పిల్లల స్నాక్స్ ప్యాకెట్‌లో బల్లి.. అసలేం జరిగిందంటే?

సిరిసిల్ల పట్టణానికి చెందిన చందు అనే వినియోగదారుడు తన పిల్లలు ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో మంగళవారం స్థానిక ‘బాలాజీ స్వీట్ హౌస్’ (Balaji Sweet House) కు వెళ్లాడు. అక్కడ భూంది కార, రింగ్స్, గాటు వంటి వివిధ రకాల స్నాక్స్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లాక పిల్లలకు పెట్టేందుకు ఆ స్నాక్స్ ప్యాకెట్లను తెరచి చూడగా ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కారప్పూస తినుబండారాల మధ్యలో చనిపోయిన బల్లి కనిపించడంతో వారి గుండె ఆగినంత పనైంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా పిల్లలు దానిని తిన్నా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని వారు వణికిపోయారు.

“అయితే ఏమైంది.. మరో కిలో ఫ్రీగా తీసుకోపో!” - ఓనర్ దురహంకారం

ఆహార పదార్థాల్లో బల్లి వచ్చిన విషయాన్ని పట్టుకుని బాధితుడు చందు సదరు స్వీట్ హౌస్ యజమాని వద్దకు వెళ్లి నిలదీశాడు. తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి, ఆ వ్యాపారి తీవ్ర అహంకారాన్ని ప్రదర్శించాడు. “బల్లి వస్తే అయితే ఏమైంది.. కావాలంటే ఇంకో కిలో ఎక్కువ ఫ్రీగా పట్టుకెళ్లు” అంటూ అత్యంత నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం చెప్పడం అక్కడున్న వారిని సైతం విస్మయానికి గురిచేసింది. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా, ప్రశ్నించిన కస్టమర్లపై ఇంత అహంకారాన్ని ప్రదర్శించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిద్రపోతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ప్రజల డిమాండ్

వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో సిరిసిల్ల ప్రజలు హోటళ్లు, స్వీట్ స్టాళ్లలో అడుగుపెట్టాలంటేనే హడలిపోతున్నారు. జిల్లాలో అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా? ఉంటే వారు క్రమం తప్పకుండా ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని ప్రజలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగి మీడియాలో రచ్చ అయినప్పుడు మాత్రమే అధికారులు వచ్చి ఫైన్లు వేసి హడావుడి చేస్తున్నారని, నిరంతర నిఘా ఉంచడంలో విఫలమవుతున్నారని కాలనీవాసులు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, నిబంధనలు ఉల్లంఘించిన ఈ ‘బాలాజీ స్వీట్ హౌస్’ యాజమాన్యంపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి, షాప్‌ను వెంటనే సీజ్ చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్‌లో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha