AP DGP Warning: సామాజిక మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్రంగా హెచ్చరించారు.
అసభ్యకరమైన, రాజకీయ ప్రేరేపిత, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిని, వదంతులు వ్యాప్తి చేసేవారిని ఉపేక్షించేది లేదని ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ఇప్పటివరకు 1,549 కేసులు నమోదు చేసి 1,344 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
Read also: Kurnool Accident: కర్నూలు రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ విచారం: ఎక్స్గ్రేషియా ప్రకటన

Digital screen monitoring social media
AP DGP Warning: సోషల్ మీడియా దుర్వినియోగంపై డిజిపి హెచ్చరిక
చట్టవిరుద్ధమైన 4,529 కంటెంట్లను తొలగించామని చెప్పారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లపై ఈ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని డీజీపీ పేర్కొన్నారు. పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు, సంఘటిత బృందాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని ఆయన తేల్చిచెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

