Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్థలం వివాదంలో మామను దారుణంగా చంపిన అల్లుడు

స్థలం వివాదంలో మామను దారుణంగా చంపిన అల్లుడు

వార్త 2 weeks ago

AP Crime: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. కంకిపాడు మండలం గోశాల గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

కేవలం స్థలం వివాదం కారణంగా అల్లుడే కాలయముడిగా మారి తన సొంత మామను దారుణంగా హత్య చేశాడు.

Read also: Medchal Tragedy: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

 Son-in-law brutally kills father-in-law over land dispute.

AP Crime: భూ వివాదమే కారణం.. ఘటనా స్థలంలోనే మృతి

పోలీసులు, స్థానికులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. గోశాల గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు (65)కు, అతని అల్లుడికి మధ్య కొంతకాలంగా ఒక స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలోనే గురువారం మరోసారి ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అల్లుడు.. క్షణికావేశంలో మామ సాంబశివరావుపై ఘోరంగా దాడి చేసి హతమార్చాడు. తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

రంగంలోకి పోలీసులు.. ఉయ్యూరు ఆస్పత్రికి మృతదేహం

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. సాంబశివరావు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడైన అల్లుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

సీసీ కెమెరాలు పెట్టి వేధింపులు.. పెళ్లయిన 48 రోజులకే వివాహిత ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha