Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుగాలి ప్రీతి హత్య కేసు.. వైఎస్ జగన్‌ను కలిసిన తల్లిదండ్రులు

సుగాలి ప్రీతి హత్య కేసు.. వైఎస్ జగన్‌ను కలిసిన తల్లిదండ్రులు

వార్త 2 weeks ago

Sugali Preethi case: సుగాలి ప్రీతి కేసు న్యాయం కోసం ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతి, రాజు నాయుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె దారుణంగా అత్యాచారానికి గురై హత్యకు గురైన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఈ ఘటన జరిగి 9 ఏళ్లు గడిచినా, తమకు ఇప్పటికీ సరైన న్యాయం దక్కలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం కేసు విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు

Read also: AP Industrial Parks: ఏపీలో కొత్తగా 38 ఇండస్ట్రియల్ పార్కులు

 Sugali Preeti’s Parents Meet YS Jagan

గతంలో అందించిన భరోసా, ప్రస్తుత పరిస్థితి

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేయబడింది. ఆ సమయంలో ప్రీతి కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించడంతో పాటు రాజు నాయుడుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. కానీ, తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును పూర్తిగా పక్కన పెట్టేశారని వారు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన పెన్షన్ నిలిపివేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామనే కారణంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

Sugali Preethi case: న్యాయం కోసం ఎదురుచూపులు

ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్న వైఎస్ జగన్, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేసులో న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో తమ ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి ఏ విధంగా అండగా నిలిచిందో గుర్తు చేస్తూ, భవిష్యత్తులో కూడా వైఎస్సార్సీపీ ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. 9 ఏళ్లుగా పోరాడుతున్న తమకు ఈసారైనా సత్వర న్యాయం జరుగుతుందని బాధితులు ఆశ వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha