PA Murder Case: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి అత్యంత నమ్మకస్తుడైన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో దర్యాప్తు అధికారులు కీలక పురోగతి సాధించారు.
పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Telangana: అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలు: చుట్టం చూపులా వచ్చి దోచుకెళ్తున్న వైనం
నిందితులను పట్టించిన డిజిటల్ అడుగుజాడలు
హత్య జరిగిన తర్వాత నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో చేసిన ఒక చిన్న పొరపాటు పోలీసులకు వరంగా మారింది. కోల్కతా సమీపంలోని బ్యాలీ టోల్ ప్లాజా దాటుతున్న సమయంలో నిందితులు UPI (యూపీఐ) ద్వారా నగదు చెల్లింపు చేశారు. ఈ డిజిటల్ లావాదేవీ ఆధారంగా వారి మొబైల్ నంబర్లు, లొకేషన్ను పోలీసులు ట్రేస్ చేశారు.
Three arrested in Suvendu Adhikari PA murder case
PA Murder Case: రెండు రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు
నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్లు గుర్తించిన ప్రత్యేక బృందాలు. టెక్నికల్ ఎవిడెన్స్తో నిందితుల కదలికలను వెంబడించిన పోలీసులు, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి వారిని బంధించారు. ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీల విశ్లేషణ ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించింది.
కుట్ర కోణంలో దర్యాప్తు
ఈ హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అన్న కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. సువేందు అధికారి పీఏ స్థాయి వ్యక్తి హత్యకు గురికావడంతో దీని వెనుక ఏవైనా రాజకీయ శక్తుల ప్రమేయం ఉందా లేదా పాత కక్షల వల్ల ఈ దారుణం జరిగిందా అనే అంశాలపై నిందితులను ప్రశ్నిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

