Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రంగాన్ని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు.
సుమారు రెండు దశాబ్దాల క్రితం రాజకీయ కారణాల వల్ల రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రతిష్టాత్మక ‘టాటా గ్రూప్’ను తిరిగి పశ్చిమ బెంగాల్కు రప్పిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. కోల్కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “టాటాలను మళ్లీ బెంగాల్ మట్టిపైకి తీసుకువచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే” అని స్పష్టం చేశారు.
Tata Group West Bengal
Read also: Prakash Raj: ధర్మస్థల కేసులో తన పేరు రావడంపై స్పందించిన ప్రకాశ్ రాజ్
సింగూర్ వివాదం.. గుజరాత్కు చేరిన నానో
దాదాపు 18 ఏళ్ల క్రితం సింగూర్లో టాటా నానో కార్ల ఫ్యాక్టరీ స్థాపన కోసం నాటి వామపక్ష (లెఫ్ట్ ఫ్రంట్) ప్రభుత్వం సేకరించిన భూములపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. నాటి ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఉధృతమైన భూపోరాటం కారణంగా టాటా మోటార్స్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బెంగాల్ నుంచి గుజరాత్కు తరలించాల్సి వచ్చింది. ఈ ఒక్క ఘటన పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక ప్రగతిని కోలుకోలేని దెబ్బతీసింది.
Suvendu Adhikari: గత ప్రభుత్వాల వైఫల్యాలపై సువేందు విమర్శలు
ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుతామని సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు. బలవంతపు భూసేకరణతో వామపక్షాలు, కేవలం కాగితాలకే పరిమితమైన పారిశ్రామిక విధానాలతో తృణమూల్ కాంగ్రెస్ (TMC) రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాయని ఆయన మండిపడ్డారు. తమ బీజేపీ ప్రభుత్వం ఎటువంటి అవినీతి, దళారీ వ్యవస్థకు తావులేకుండా, అత్యంత పారదర్శక విధానాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తుందని భరోసా ఇచ్చారు. బెంగాలీ యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన వివరించారు.
బెంగాల్లో మారిన రాజకీయ చిత్రం
ఇటీవల (2026) జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించి, 15 ఏళ్ల మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనకు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. మే నెలలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సువేందు అధికారి, రాష్ట్ర పారిశ్రామిక పునరుజ్జీవనమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఈ నిర్ణయం ద్వారా చాటిచెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
ఎట్టకేలకు పోలీసులకు దొరికిన దావణగెరెకు చెందిన హంతకురాలు ప్రియాంక

