Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'తల్లికి వందనం' ఒకే ఇంటికి రూ.78వేలు

'తల్లికి వందనం' ఒకే ఇంటికి రూ.78వేలు

వార్త 2 weeks ago

Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లలో కొత్త వెలుగులు నింపుతోంది.

గతంలో లాగా పరిమితులు విధించకుండా, ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి/కళాశాలకు వెళ్తున్నా ప్రతీ ఒక్కరికీ ఈ ఆర్థిక సాయాన్ని వర్తింపజేస్తుండటంతో పలు కుటుంబాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన ఏలియా, సంగీత దంపతుల ఆరుగురు పిల్లలు చదువుతుండటంతో, వారి ఖాతాలో ఒకేసారి రూ.78,000 (ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున) జమ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో తమ పిల్లల చదువులకు పెద్ద నిలకడ లభించిందని, ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయాయని సదరు దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల్లో లబ్ధిదారుల సంబరాలు: త్వరలోనే రెండో విడత నిధుల విడుదల!

కేవలం కర్నూలు జిల్లాలోనే కాకుండా నెల్లూరు, పల్నాడు, శ్రీసత్యసాయి, బాపట్ల తదితర అనేక జిల్లాల్లో ఐదుగురు పిల్లలు చదువుతున్న కుటుంబాలకు రూ.65,000 చొప్పున ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థుల నమోదును ప్రోత్సహించడంతో పాటు, డ్రాపౌట్లను తగ్గించడంలో ఈ నిర్ణయం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని విద్యాశాఖ నిపుణులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మొదటి విడతలో అర్హులైన వారికి నిధులు అందగా, నూతనంగా చేరిన ఫస్ట్ క్లాస్ (ఒకటో తరగతి) మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఫస్టియర్) విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో విడతలో డబ్బులు జమ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దానయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పార్థసారథి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha