Tamil Nadu: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ కి చెందిన వ్యక్తులైనప్పటికీ, ఇతర దేశాల పౌరసత్వం కలిగి ఉండి చట్టవిరుద్ధంగా ఓటు వేసిన సుమారు 25 మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల సాయంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో తలదూర్చిన వీరిని విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది.
ఓటు వేసిన అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన నిందితులను చెన్నై, మదురై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పోలీసులు పట్టుకున్నారు. వీరిలో శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల పౌరసత్వం ఉన్న వారు ఉన్నారు. ముఖ్యంగా పట్టుకోట్టై, పెరంబూర్, కేకే నగర్ వంటి నియోజకవర్గాల్లో వీరు ఓటు వేసినట్లు విచారణలో తేలింది.
Read Also: NEET Paper Leak Case Update: మరో నిందితుడు ధనంజయ్ అరెస్ట్!
Voting irregularities in Tamil Nadu Assembly elections
Tamil Nadu: బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్న వ్యక్తి అరెస్ట్
2015లో బ్రిటిష్ పౌరసత్వం పొందిన ఒక వ్యక్తి పట్టుకోట్టై నియోజకవర్గంలో ఓటు వేసి, లండన్ వెళ్లేందుకు చెన్నై ఎయిర్పోర్టులో దొరికిపోయాడు. ఇలాంటి వారు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాతే రాష్ట్రానికి చేరుకున్నారని, సిరా చెరిగిపోయే వరకు ఇక్కడే ఉండేందుకు ప్లాన్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. కేవలం తమిళనాడులోనే కాకుండా, ఇద్దరు విదేశీయులు పుదుచ్చేరిలో కూడా ఓటు వేసినట్లు అధికారులు గుర్తించారు.
కఠిన సెక్షన్ల కింద కేసులు
అరెస్టయిన వారిపై భారత న్యాయ సంహిత (BNS) 2023 మరియు ప్రజాప్రతినిధ్య చట్టం 1950లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విదేశీ పౌరసత్వం ఉన్నప్పుడు భారతీయ ఓటరు కార్డును కలిగి ఉండటం, వినియోగించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఇతర దర్యాప్తు పద్ధతుల ద్వారా ఇలాంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారనే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

