Dailyhunt
తమిళనాడు గవర్నర్ నిర్ణయం సరైనదే: హరీశ్ సాల్వే

తమిళనాడు గవర్నర్ నిర్ణయం సరైనదే: హరీశ్ సాల్వే

వార్త 17 hrs ago

Tamil Nadu politics : తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ మధ్య సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని నిరూపించుకోవాలని టీవీకే అధినేత విజయ్‌ను గవర్నర్ కోరడం పూర్తిగా రాజ్యాంగబద్ధమైన చర్యేనని ఆయన స్పష్టం చేశారు.

ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీశ్ సాల్వే, అతిపెద్ద పార్టీగా అవతరించడం మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోదని పేర్కొన్నారు. శాసనసభ విశ్వాసాన్ని పొందగలిగే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం ఉందా లేదా అనేది గవర్నర్ పరిశీలించాల్సిన ముఖ్య అంశమని తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఉందని కేవలం మౌఖికంగా చెప్పడం కాకుండా, మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన స్పష్టమైన పత్రాలు ఇవ్వాలని గవర్నర్ అడగడం ఆయన విచక్షణాధికార పరిధిలోకే వస్తుందని హరీశ్ సాల్వే అభిప్రాయపడ్డారు. అలా అడగడం ద్వారా గవర్నర్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్లు కాదని వివరించారు.

Read Also:Vijay TVK CM Convoy: ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌ను తిరస్కరించిన విజయ్?

 Tamil Nadu politics

అయితే ఎమ్మెల్యేలను భౌతికంగా తన ముందు హాజరుపరచాలని కోరితే మాత్రం అది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, స్థిర ప్రభుత్వం ఏర్పాటే ముఖ్యమని వ్యాఖ్యానించారు.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది సభ్యుల మద్దతు అవసరం. టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ మద్దతుతో కూడా ఇంకా మెజారిటీకి దూరంగానే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఖర్గే షూలను చేతితో పక్కకు జరిపిన రాహుల్ గాంధీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha