Tamil Nadu Politics: తమిళనాడు అసెంబ్లీలో సోమవారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వంలో మంత్రిగా ఎంపికైన కీర్తన, సాంకేతిక కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
కీలకమైన పత్రాన్ని వెంట తెచ్చుకోకపోవడమే ఇందుకు కారణమైంది.
Read Also: Vijay Oath Ceremony : వివాదంలో విజయ్ ప్రమాణ స్వీకారం
Tamil Nadu Minister Keerthana’s oath taking as MLA postponed.. This is the reason!
Tamil Nadu Politics: ఎలక్షన్ సర్టిఫికెట్ లేకపోవడంతో బ్రేక్
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ‘ఎలక్షన్ సర్టిఫికెట్’ (ధృవీకరణ పత్రం) ను ప్రొటెం స్పీకర్కు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, మంత్రి కీర్తన ఈ ఒరిజినల్ సర్టిఫికెట్ను వెంట తీసుకురాకపోవడంతో, ఆమెను ప్రమాణ స్వీకారానికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.
రాజకీయ వర్గాల్లో చర్చ
కీలక బాధ్యతలు చేపట్టబోతున్న ఒక మంత్రి, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పత్రాన్ని మర్చిపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సభలోని ఇతర సభ్యులంతా వరుసగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో, మంత్రి కీర్తనకు ఈ పరిస్థితి ఎదురుకావడం గమనార్హం. కేవలం ఒరిజినల్ సర్టిఫికెట్ సమర్పించిన వారిని మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆమె ప్రమాణ స్వీకారం ఆగిపోయినప్పటికీ, అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత ఆమె మరోసారి ప్రత్యేకంగా ప్రొటెం స్పీకర్ లేదా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

