అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్కు చెందిన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అమెరికా విదేశాంగ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
ఐఆర్జీసీకి సంబంధించిన ఆర్థిక యంత్రాంగాలు, నిధుల సేకరణ మార్గాలు, వారి రహస్య వ్యాపార నెట్వర్క్ల గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 125 కోట్లు) భారీ రివార్డును ప్రకటించింది. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఐఆర్జీసీ యొక్క విస్తృతమైన ఆర్థిక సామ్రాజ్యమేనని చెప్పుకోవచ్చు.
Iran-America War
Iran-America War: దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ శక్తిగా..
ఈ సంస్థ కేవలం ఇరాన్ సైన్యంలో భాగం మాత్రమే కాదు, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ శక్తిగా ఎదిగింది. ముడి చమురు అక్రమ రవాణా, షెల్ కంపెనీల ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చొరబడటం, ఉగ్రవాద ముఠాలకు ఆయుధాలు సరఫరా చేయడం వంటి పనుల ద్వారా ఈ సంస్థ భారీగా నిధులను ఆర్జిస్తోంది. ఈ నిధులు పశ్చిమ ఆసియాలో అస్థిరతకు కారణమవుతున్నాయని, ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ వాతావరణంలో ఈ ఆర్థిక సాయమే ప్రాణవాయువుగా మారుతోందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. అందుకే ఈ రివార్డు ద్వారా ఆ సంస్థకు సాయం చేసే వ్యక్తులు లేదా నెట్వర్క్లను బహిర్గతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ రివార్డు ప్రోగ్రామ్ కింద మూడు ప్రధాన అంశాలపై సమాచారాన్ని అమెరికా కోరుతోంది. రెండోది, అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి వారు ఉపయోగిస్తున్న రహస్య ఆర్థిక సంస్థలు ఏవి?.. మూడోది, వారి తరపున పని చేస్తున్న బినామీ ఏజెంట్లు ఎవరు? ఈ వివరాలు తెలిస్తే ఇరాన్ ఆర్థిక వనరులను పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చని అమెరికా భావిస్తోంది. ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ అనే కార్యక్రమం ద్వారా ఈ ఆఫర్ను ప్రకటించిన అమెరికా.. సమాచారం ఇచ్చే వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు? ఆర్బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక!

