Dailyhunt
టెక్నాలజీతో ఆడిన మాయాజాలం: శ్రీనివాస్ కిరణ్ బాబు మోసాల వెనుక అసలు కథ

టెక్నాలజీతో ఆడిన మాయాజాలం: శ్రీనివాస్ కిరణ్ బాబు మోసాల వెనుక అసలు కథ

వార్త 2 days ago

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న శ్రీనివాస్ కిరణ్ బాబు, చదువుకున్న విద్యను మోసాలకు ఎలా వాడాడో విచారణలో వెల్లడైంది. అతను కేవలం ఒక సాధారణ నేరగాడు మాత్రమే కాదు, పోలీసుల కళ్లు గప్పడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు.

శ్రీనివాస్ కిరణ్ బాబు ప్రధానంగా ఐటీ రంగంలో ఉన్న యువతులను లక్ష్యంగా చేసుకునేవాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అత్యంత కీలకమైన ‘SAP సర్టిఫికేషన్’ చేయిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడు. నిందితుడు ఎప్పుడూ తన పేరు మీద సిమ్ కార్డులు గానీ, మొబైల్ ఫోన్లు గానీ కొనేవాడు కాదు. ప్రతి కొత్త బాధితుడికి ఒక కొత్త ఫోన్, కొత్త సిమ్ వాడటం అతని అలవాటు. ఒకసారి మోసం పూర్తయ్యాక వాటిని పారేసేవాడు.

Read Also: Kamareddy Road Accident:పెళ్లింట రోడ్డు ప్రమాదం..ఎనిమిది మందికి గాయాలు

 Defrauding Young Women

Defrauding Young Women: బెట్టింగ్ యాప్‌ల వినియోగం

తన బ్యాంకు ఖాతాకు డబ్బులు తీసుకుంటే దొరికిపోతానని గ్రహించి, బాధితుల నుంచి సొమ్మును నేరుగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌లకు బదిలీ చేయించేవాడు. దీనివల్ల లావాదేవీల మూలాలు వెతకడం పోలీసులకు కష్టమయ్యేది. ప్రకాశం జిల్లాకు చెందిన ఇతను ఎంసీఏ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో హెచ్ఆర్ (HR) విభాగంలో పనిచేయడం వల్ల యువతుల ఫోన్ నంబర్లు, వారి వ్యక్తిగత వివరాలను సులభంగా సేకరించగలిగాడు. ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ. 27 లక్షలు వసూలు చేయడం ఇతని మోసాల తీవ్రతను తెలియజేస్తోంది. విజయవాడకు చెందిన ఒక యువతి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు, నిందితుడు వాడిన సిమ్ కార్డులు కాకినాడలో యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. కాకినాడలోని సిమ్ విక్రేత ఇచ్చిన నిందితుడి ఆనవాళ్లు (Physical description) కీలకమయ్యాయి. చివరకు అతను వాడుతున్న ప్రస్తుత ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడలో వల పన్ని అరెస్ట్ చేశారు. ఇతని నుంచి 6 సిమ్ కార్డులు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha