Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే?

తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్కడంటే?

వార్త 3 weeks ago

Telangana New Airports: తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించేందుకు మరియు జిల్లాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో శంషాబాద్ (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంతో, జిల్లాల ప్రజలు విమాన ప్రయాణం కోసం హైదరాబాద్ రావాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం మరో మూడు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పనులకు వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులపై కేంద్రంతో సంప్రదింపులు

వరంగల్‌తో పాటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

  • ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్: ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ గతంలో వాయుసేన (IAF) కు చెందిన రన్‌వే ఉండేది. ఇప్పుడు దానికి అదనపు భూమిని సేకరించి, అటు మిలిటరీ అవసరాలకు, ఇటు సామాన్య పౌరుల ప్రయాణాలకు (సివిల్ ఏవియేషన్) ఉపయోగపడేలా హైబ్రిడ్ మోడల్‌లో దీనిని నిర్మించనున్నారు.
  • కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్: ఇక్కడ కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే దీనికి కూడా తుది అనుమతులు లభిస్తాయని అధికార యంత్రాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Telangana New Airports: ‘ఏరోమార్ట్ 2026’ సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైన ‘ఏరోమార్ట్ 2026’ సదస్సుకు రాష్ట్ర పౌరసరఫరాలు, రక్షణ ప్రాజెక్టుల సమన్వయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు వచ్చే నెలలోనే భూమిపూజ చేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి డీపీఆర్ (DPR) కూడా సిద్ధమైందని తెలిపారు.

తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు అద్భుతంగా రాణిస్తున్నాయని.. ఈ రంగాలకు అవసరమైన విడిభాగాలు తయారుచేసే 1500 కి పైగా ఎంఎస్ఎంఈ (MSME) లు రాష్ట్రంలో సేవలందిస్తున్నాయని ఆయన కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే పలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ విడిభాగాలు ఉండటం మన పారిశ్రామిక ప్రగతికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గర్వంగా ప్రకటించారు.

read also:

పాలనపై చర్చకు సిద్ధం.. రేవంత్ సవాల్‌పై కేటీఆర్ రియాక్షన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha