Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్

తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్

వార్త 1 month ago

Telangana Education Bandh:తెలంగాణలో విద్యా సంస్థల బంద్ శుక్రవారం జరగనుంది. వివిధ విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించకూడదని విద్యార్థి నాయకులు గట్టిగా కోరుతున్నారు. విద్యారంగంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతున్నారు. ఈ బంద్‌కు సహకరించాలని విద్యా సంస్థల యాజమాన్యాలను ఇప్పటికే కోరడం జరిగింది.

Read also: Telangana Politics: కాళేశ్వరం కూలిపోతే గోదావరి జలాలు ఎలా వస్తున్నాయి.. హరీష్ రావు

 Telangana education institutions bandh tomorrow

విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. రాష్ట్రంలో 27 వేల పాఠశాలలు ఉంటే వాటిని 4 వేలకు కుదించడం సరికాదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని కోరుతున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Telangana Education Bandh:ఇతర కీలకమైన సమస్యలు ఇవే

ఇంటర్ కళాశాలల్లో వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యాహక్కు చట్టం ద్వారా పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలి. ప్రైవేటు సంస్థల్లో పుస్తకాలు, నోట్ బుక్స్ అమ్ముతున్న తీరును అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని, విద్యారంగ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు శుక్రవారం నిరసన కార్యక్రమాల్లో భాగంగా బంద్ చేపట్టారు.

Epaper: epaper.vaartha.com

దారుణం.. పొలం వద్ద నిద్రిస్తున్న యువకుడి దారుణ హత్య..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha