థాయ్లాండ్ (Thailand) లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దుండగులు స్కూల్లోకి చొరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 34 మంది చనిపోయారు..
మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు.ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సాయుధ పోలీసులు చేరుకున్నారు. వందలాది మంది యువకులు పాఠశాల బయటకి పారిపోగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంకా భవనం లోపలే చిక్కుకుపోయారు.
Bangladesh: హత్యకు గురైన దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం
పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు
పోలీసుల ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తికి 18 ఏళ్లు అని తెలుస్తోంది. పాఠశాలకు సమీపంలోనే అతని ఇల్లు ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, 2022లో ఒక మాజీ పోలీసు అధికారి తుపాకీ, కత్తితో దాడి చేయడం వల్ల ఒక నర్సరీ స్కూల్లో 22 మంది పిల్లలు సహా 36 మంది చనిపోయారు.
Read hindi news: hindi.vaartha.com

