Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే!

టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే!

వార్త 2 weeks ago

TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) భవిష్యత్తులో చేపట్టే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలను కేవలం కంప్యూటర్ ఆధారిత పద్ధతిలోనే (Computer Based Test - CBT) నిర్వహిస్తామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.

ఈ నూతన విధానం ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మరింత పారదర్శకత, అదనపు భద్రత చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read also: TGPSC Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల

సంప్రదాయ ఓఎంఆర్ (OMR) విధానానికి స్వస్తి.. సిబిటితో పెరగనున్న భద్రత

హైదేరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక కాలంలో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల నిర్వహణకు ఆన్‌లైన్ విధానమే అత్యంత సురక్షితమైన మార్గమని పేర్కొన్నారు. పాత ఓఎంఆర్ షీట్ల పద్ధతి కంటే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఎంతో మేలైనవని, ఇందులో లీకేజీలకు తావుండదని వివరించారు. ఈ విధానం ద్వారా పరీక్ష ప్రారంభానికి కేవలం ఒక గంట ముందు కూడా ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసుకునే వినూత్న వెసులుబాటు ఉంటుందని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల్లో కమిషన్ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు సాంకేతిక సంస్కరణలను పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

TGPSC: విమర్శలను పట్టించుకోం.. ప్రతి రెండు నెలలకొకసారి మీడియా ముందుకు!

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని, అందువల్ల పోటీ పరీక్షల్లో కొందరికి నిరాశ ఎదురవడం సహజమేనని చైర్మన్ అభిప్రాయపడ్డారు. కమిషన్ పనితీరుపై వచ్చే నిరాధారమైన ఆరోపణలను, విమర్శలను తాము అస్సలు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంపొందించేందుకు మరియు అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఇకపై ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి అధికారికంగా మీడియా సమావేశాలు నిర్వహించి అప్‌డేట్స్ ఇస్తామని బుర్రా వెంకటేశం ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha