ఫోటోరైటప్ : చిన్నారులకు అక్షరాబ్యాసం నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రులు
Anganwadi Centers: చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
సోమవారం రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-4 లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా విచ్చేసిన రాష్ట్ర మంత్రులు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Read Also: Singareni Accident Insurance Scheme: సింగరేణిలో కార్మిక కుటుంబాలకు బీమా రక్షణ
The role of Anganwadi centers in equipping children with skills
Anganwadi Centers: అంగన్వాడీల బలోపేతం, ఆధునిక వసతులు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాల్లోనే పిల్లలను చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక సౌకర్యాలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేస్తున్నామని, పిల్లలకు 'అమ్మ ముద్ద' పేరుతో అల్పాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేసి ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి వేతనాల పెంపు దిశగా కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
గిరిజన కుటుంబాలకు హైదరాబాద్ సందర్శన భాగ్యం
నిరుపేద కుటుంబాలకు పిల్లలే నిజమైన ఆస్తి అని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలను ప్లే స్కూళ్లు, అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు వెయ్యి మందికి హైదరాబాద్ నగరాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్నడూ హైదరాబాద్ చూడని గిరిజనులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడంతో పాటు అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టారు.
విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసి చిన్నారులను ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ హరిత అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, అంగన్వాడి టీచర్స్ తో మాట్లాడారు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్వేత శుక్ల, గోలేటి సర్పంచ్ అజ్మీరా బాబురావు, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి శ్యాం నాయక్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ ఇరుకుల్ల మంగ, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ తిరుపతి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే: పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు!

