TTD Anna Prasadam: తిరుమల శ్రీవారి భక్తులకు కొండపై అన్నప్రసాదం అతి ముఖ్యమైనది. అయితే, గత పది రోజులుగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు ఇతర వితరణ కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.
సాధారణ రోజుల కంటే ఇప్పుడు రద్దీ అసాధారణంగా పెరగడానికి కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధమే కావడం గమనార్హం.
Read also: Indrakeeladri: ఆగమోక్తంగా ప్రారంభమైన చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు

Huge Rush for Anna Prasadam in Tirumala
TTD Anna Prasadam: యుద్ధ ప్రభావం.. హోటళ్ల మూత
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా తిరుమలలోని ప్రైవేట్ హోటళ్లు, దాదాపు 40కి పైగా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. నడుస్తున్న కొన్ని హోటళ్లు కూడా పరిమితమైన మెనూతో (సాంబార్ రైస్, పెరుగన్నం వంటివి) మాత్రమే సేవలు అందిస్తున్నాయి. దీంతో భక్తులకు టీటీడీ అన్నప్రసాద కేంద్రాలే ఏకైక దిక్కయ్యాయి.
పది రోజుల్లో పెరిగిన గణాంకాలు ఇవే!
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్నప్రసాదం స్వీకరించే వారి సంఖ్య భారీగా పెరిగింది. టీటీడీ గణాంకాల ప్రకారం
- అల్పాహారం (మార్చి 16 - 25): గతేడాది 1.27 లక్షలు ఉండగా, ఈ ఏడాది 1.32 లక్షలకు చేరింది.
- మధ్యాహ్నం & రాత్రి భోజనం: 2025లో 5.95 లక్షల మంది భోజనం చేయగా, ఈ ఏడాది అదే సమయంలో ఏకంగా 7.41 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
- అంటే కేవలం పది రోజుల్లోనే దాదాపు లక్షన్నర మంది అదనంగా అన్నప్రసాదం తీసుకున్నారు.
టీటీడీ ముందస్తు చర్యలు
భక్తుల రద్దీ పెరుగుతున్నా, ఎక్కడా ఇబ్బంది కలగకుండా టీటీడీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ కంపెనీలతో మాట్లాడి వెంగమాంబ, వకుళమాత, శ్రీఅక్షయ కేంద్రాలకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అయ్యేలా చూస్తోంది. ప్రైవేట్ హోటళ్లు పూర్తిగా మూతపడినా, ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

