Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక గంటల్లోనే శ్రీవారి దర్శనం!

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక గంటల్లోనే శ్రీవారి దర్శనం!

వార్త 1 week ago

Tirumala Darshan updates: వేసవి సెలవుల వల్ల తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. అయినా సరే మునుపటిలా కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టీటీడీ సరికొత్త పద్ధతులను అమలు చేస్తోంది.

దీనివల్ల కొండపై ఎంత రద్దీ ఉన్నా సరే భక్తులు సౌకర్యవంతంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా నారాయణగిరి షెడ్లలోనే రద్దీని నియంత్రిస్తూ క్యూలైన్లు రోడ్ల మీదకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మార్పుల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Read also: Tirumala updates: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

 TTD Integrated Command Control Room View

Tirumala Darshan updates: కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణ

తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు భక్తుల పాలిట వరంగా మారింది. ఆధునిక సీసీ కెమెరాల ద్వారా అన్నప్రసాద కేంద్రాలు, పార్కింగ్ ఏరియాలు మరియు క్యూ కాంప్లెక్స్‌లను అధికారులు నిరంతరం గమనిస్తున్నారు. ఎక్కడైనా రద్దీ ఎక్కువైతే వెంటనే అదనపు సిబ్బందిని పంపి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. డిజిటల్ మానిటరింగ్ సాయంతో భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అవసరమైన చోట తాగునీరు, పాలు వంటి కనీస సౌకర్యాలు వేగంగా అందేలా చూస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల దర్శన సమయం గణనీయంగా తగ్గింది.

తగ్గిన వెయిటింగ్ టైమ్.. రికార్డు స్థాయిలో భక్తుల రాక

గతంలో భారీ రద్దీ ఉంటే సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పట్టేది. కానీ టీటీడీ కొత్త ప్లాన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు అయితే 2 గంటల లోపే స్వామివారి కృప కలుగుతోంది. మే మొదటి వారంలోనే దాదాపు 9 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. వారాంతాల్లో 85 వేల మందికి పైగా జనం వస్తున్నా, ఎక్కడా తొక్కిసలాట జరగకుండా టీటీడీ యంత్రాంగం 24 గంటల పాటు అప్రమత్తంగా సేవలందిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha