Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TMCలో కీలక పరిణామం !

TMCలో కీలక పరిణామం !

వార్త 2 months ago

TMC : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మధ్య జరిగిన రాజకీయ పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

“పార్టీలో అల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలో, దశాబ్దాలుగా నమ్ముకున్న తాను కావాలో తేల్చుకోవాలి” అంటూ ఇటీవల మమతకు బహిరంగంగానే అల్టిమేటం జారీ చేసిన టీఎంసీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ ఒక్కసారిగా తన పంథాను మార్చుకుని వెనక్కి తగ్గారు. గతంలో అభిషేక్ వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన ఆయన, తాజా ప్రకటనతో పార్టీలో చెలరేగిన పొలిటికల్ హైడ్రామాకు తాత్కాలికంగా తెరదించారు.

Read Also : విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్!

“అభిషేక్ నా కొడుకు లాంటివాడు”.. సీఎం సువేందు అధికారిపై ధ్వజం!

తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన కళ్యాణ్ బెనర్జీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీ తనకు కొడుకు లాంటివాడని, కొడుకు ఏదైనా తప్పు చేస్తే క్షమించి సద్బుద్ధి చెప్పడం తండ్రిగా తన బాధ్యత అని పేర్కొంటూ పాత వివాదాలను పక్కనబెట్టే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సువేందు అధికారి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రాష్ట్రంలో విపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టేసే ఇలాంటి దారుణమైన రాజకీయ పరిస్థితిని తాను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొనేందుకు పార్టీ అంతా ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందనే సంకేతాన్ని ఆయన ఈ సందర్భంగా ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'లియాకి ఫ్రీడమ్' నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha