Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలి హైడ్రోజన్ రైలుకు భారత రైల్వే ఆమోదం

తొలి హైడ్రోజన్ రైలుకు భారత రైల్వే ఆమోదం

వార్త 2 weeks ago

Hydrogen Train: భారతీయ రైల్వే రవాణా రంగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ (Hydrogen Fuel Cell) సాంకేతికతతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది.

ఉత్తర రైల్వే పరిధిలోని హర్యానాలోని జింద్ – సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ వినూత్న రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

 india first hydrogen fuel cell train

Read also: Narendra Modi: పెరుగుతున్న ఎండలు.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!

గంటకు 75 కి.మీ వేగం.. కాలుష్యానికి శాశ్వత చెక్!

ఈ హైడ్రోజన్ రైలు గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది. దీనికోసం రైల్వే శాఖ 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అమర్చింది. ఈ అడుగుతో రైల్వే రంగంలో హైడ్రోజన్ టెక్నాలజీని వాడుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. ఈ సాంకేతికతలో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుతూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. సాంప్రదాయ డీజిల్ ఇంజన్లలా కాకుండా, ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి (Water Vapor) మాత్రమే ఉప ఉత్పత్తిగా బయటకు వస్తుంది. దీనివల్ల కాలుష్యం సున్నా శాతానికి చేరుకుంటుంది.

Hydrogen Train: జింద్‌లో స్వదేశీ రీఫ్యూయలింగ్ కేంద్రం

ఈ ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన జింద్ వేదికగా రైలుకు ఇంధనాన్ని నింపేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన రీఫ్యూయలింగ్ మరియు నిల్వ కేంద్రాన్ని రైల్వే శాఖ సిద్ధం చేసింది. ఇక్కడ కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్ నిల్వ, పంపిణీ ప్రక్రియల కోసం ‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ (PESO) నుండి అన్ని రకాల అనుమతులు మరియు లైసెన్సులు లభించాయి.

భద్రతకు పెద్దపీట.. 24 గంటల నిఘా

ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి రైల్వే శాఖ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. అందుకోసం తీసుకున్న భద్రతా చర్యలు ఇవే: జింద్ ఇంధన కేంద్రంలో అత్యాధునిక హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు మరియు అత్యవసర సెన్సార్లను అమర్చారు. రైలు నిర్వహణను పర్యవేక్షించేందుకు షకుర్‌బస్తీలో ప్రత్యేక ఫెసిలిటీని కఠినమైన భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ఆమోదించిన నిబంధనల ప్రకారమే ఈ రైలు నడుస్తుంది. శిక్షణ పొందిన సాంకేతిక సిబ్బంది 24 గంటల పాటు రైలును పర్యవేక్షిస్తారు. ప్రారంభ దశలో ఈ సిబ్బంది రైలులోనే ప్రయాణించి లైవ్ మానిటరింగ్ చేయనున్నారు.

భారతదేశం నిర్దేశించుకున్న ‘నెట్-జీరో’ (Net-Zero) కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో మరియు హరిత రవాణాను ప్రోత్సహించడంలో ఈ హైడ్రోజన్ రైలు ఒక మైలురాయిగా నిలవనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

కర్ణాటకలో పొలిటికల్ హీట్: రేపు సిద్ధరామయ్య రాజీనామా? మే 30న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha