Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోదీ!

తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన మోదీ!

వార్త 3 weeks ago

India First Hydrogen Train: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలెక్కింది.

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఎట్టకేలకు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న ఉదయం 11 గంటల సమయంలో హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.

ఈ హైడ్రోజన్ రైలు సాధారణ ప్రయాణికులకు అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాన్ని కల్పించనుంది. ఈ రైలులో కనీస ప్రయాణ ఛార్జీ కేవలం రూ. 5 నుండి ప్రారంభమై, గరిష్టంగా రూ. 25 వరకు మాత్రమే ఉంటుంది. అనేక రైల్వే స్టేషన్లలో లభించే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఛార్జీ కంటే ఈ రైలు ప్రారంభ ఛార్జీ తక్కువగా ఉండటం విశేషం. మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఈ టికెట్ ధరలు ఎంతో ఊరటనివ్వనున్నాయి.

Read Also: Instagram, Facebook : మెటా సరికొత్త భద్రతా ఫీచర్ - పిల్లల మానసిక స్థితిపై తల్లిదండ్రులకు అలర్ట్!

 Modi launches the first hydrogen train!

India First Hydrogen Train: జింద్ – సోనిపత్ మార్గంలో ప్రయాణం.. 11 స్టాపింగ్‌లు

ఈ సరికొత్త రైలు హర్యానాలోని జింద్ – సోనిపత్ మార్గంలో ప్రయాణించనుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. మొత్తం 10 కోచ్‌లతో (బోగీలతో) రూపొందించబడిన ఈ రైలు, మార్గమధ్యంలో 11 చోట్ల ఆగుతుంది. రోజుకు సుమారు 2,600 మంది ప్రయాణికులను ఇది సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చగలదు.

స్వదేశీ సాంకేతికత.. శూన్య ఉద్గారాలు

ఈ రైలును పూర్తిగా స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు (Overhead Lines) లేకుండానే నడుస్తుంది. కార్బన్ ఉద్గారాలను భారీగా విడుదల చేసే డీజిల్ రైళ్లలా కాకుండా, ఈ హైడ్రోజన్ రైలు కేవలం ‘నీటి ఆవిరిని’ మాత్రమే పర్యావరణంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ రైలును నడపడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్‌ను జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ నుండి సరఫరా చేయనున్నారు. ప్రయాణికుల రక్షణ కోసం ఈ ప్రాజెక్ట్‌లో అధునాతన భద్రతా ఫీచర్లను కూడా ఏర్పాటు చేశారు.

Epaper: epaper.vaartha.com

భారత రైల్వేలో హైడ్రోజన్ యుగానికి శ్రీకారం..ఏమిటి దీని ప్రత్యేకత?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha