అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కొద్దిగా తొలగుతున్నట్లు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి.
ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన పాజిటివ్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో భరోసాను నింపాయి. అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 22తో ముగియనుంది. ఈ లోపే మరో రౌండ్ చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించాలని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ నేతృత్వంలోని బృందం టెహ్రాన్ పర్యటనలో ఉంది. రెండో విడత చర్చల వేదిక, షరతులపై వీరు కీలక పాత్ర పోషించనున్నారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ చేసిన ప్రకటన గ్లోబల్ మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. చర్చలు సఫలమైతే చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్న ఆశలు చిగురించాయి.
Read Also: US Iran Talks: అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు..ట్రంప్ ప్రకటన
Iran-America War
Iran-America War: దేశీయ మార్కెట్లపై ప్రభావం
యుద్ధం ముగిసిపోతుందన్న వార్తలతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (Sensex) మరియు నిఫ్టీ (Nifty) భారీ లాభాలను నమోదు చేశాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గడంతో దిగుమతి భారం తగ్గుతుందన్న అంచనాతో ఆటో, పెయింట్స్ మరియు టైర్ కంపెనీల షేర్లు పెరిగాయి. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా స్థిరపడింది. ఒకవైపు చర్చలు జరుగుతున్నా, అమెరికా తన పట్టును సడలించడం లేదు. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా నౌకాదళం కొనసాగిస్తోంది. ఆర్థికంగా ఇరాన్ను దెబ్బతీసి, చర్చల్లో తమ షరతులకు ఒప్పుకునేలా చేయడమే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

